కరెంట్ అఫైర్స్- 2013 సాధారణ ఎన్నికలు
బ్లాగిల్లులో ఇతర బ్లాగులలోని సమాచారాన్ని చూస్తున్నపుడు ఒక బ్లాగ్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన సమాచారం కనిపించింది. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ సమాచారాన్ని కాపీ చేసి నవచైతన్య కాంపిటీషన్స్లో అందుబాటులో ఉంచుతున్నాను. ఈ సమాచారాన్ని అందించిన బ్లాగర్కు నవచైతన్య కాంపిటీషన్స్ హృదయపూర్వక ధన్యవాదములు
- 2014 పార్లమెంట్ ఎన్నికల లో అర్హత ఉన్న వోటర్ల సంఖ్య 81.4 కోట్ల మంది.
- 2014 పార్లమెంట్ ఎన్నికలలో దేశవ్యాప్తం గా అత్యంత అధికంగా వోటింగ్ శాతం 66.38% జరిగింది. (1984 లో 64.01%,2009 లో 58.13% జరిగింది.)
- 2014 లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ దేశవ్యాప్తంగా 989 కేంద్రాలలో జరిగింది.
- అరుణాచల్ ప్రదేశ్ లోని బొందిల జిల్లాలో కేవలం 3గురు వోటర్లు మాత్రమే ఎన్నికలలో పాల్గొన్నారు.
- బిజేపి గుజరాత్(26), రాజస్తాన్(25) డిల్లీ (౭) గోవా (2) హిమాచల్ ప్రదేశ్ (4) ఉత్తరాఖండ్ (5) లలో పూర్తి స్థానాలను సాదించినది.
- కేరళ,మణిపుర్, మేఘాలయ,మిజోరాం,నాగాలాండ్ లలో బిజేపి ఒక్క స్థానము సాదించలేదు.
- గుజరాత్,హిమాచల్ ప్రదేశ్,జార్ఖండ్,డిల్లీ,ఒరిస్సా,రాజస్థాన్,తమిలనాడు మరియు పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ ఒక్క స్థానము సాదించలేదు.
- కాంగ్రెస్ లోక్ సభ లో అత్యధికంగా 1984 లో 414 స్థానాలు సాదించగా అత్యల్పంగా 2014 లో 44స్థానాలు సాదించినది.
- కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయే ప్రమాదం లో పడినది.
- బిజేపి పూర్వపు అత్యుత్తమ ప్రదర్శన 1998,1999 ఎనికలలో 182 స్థానాలు ఉండగా ప్రస్తుతం 2014 లో అత్యధికంగా 282 స్థానాలు సాదించినది.
- కాంగ్రెస్ పూర్వపు నిరాశ ప్రదర్శన 1999 లో 114 స్థానాలు సాదించగా ప్రస్తుతం 2014 లో 44 స్థానాలు సాదించినది.
- భారత పార్లమెంట్ ఎన్నికలలో ఒకే పార్టీ అత్యుత్తమ ప్రదర్శన గా 1984 లో కాంగ్రెస్స్ అదికంగా 414 స్థానాలు సాదించగా,దాని తరువాత ప్రస్తుతం 2014 లో బిజేపి 282 స్థానాలు సాదించినది.
- 1984 తరువాత సొంతంగా ఒక పార్టీ ఈ సారి అనగా 2014 లో బిజేపి అధికారాన్ని చేపట్ట బోతున్నది.
- లెఫ్ట్ పార్టీలు తొలి సారిగా అత్యంత తక్కువ స్థానాలు సాదించినవి. మొత్తం 10 స్థానాలు అనగా సిపిఐ ఒక స్థానాన్ని సిపిఎం 9 స్థానాలు మాత్రమే సాదించినది.
- సిపిఎం 3.2% వొట్లను,సిపిఐ 0.8% వొట్లను సాదించినవి.
- 1984 లో యూపి లో కాంగ్రెస్స్ 85 స్థానాలకు గాను 83 స్థానాలు సాదించగా ప్రస్తుతం బిజేపి యూపి లో 80 స్థానాలకు గాను 71స్థానాలు సాదించినది.
- 2014 ఎన్నికలలో బిజేపి 31.1% వొట్లను సాదించగా, కాంగ్రెస్ 19.4% వొట్లను సాదించినది.
- 2014 లో కాంగ్రెస్ నిరాశ పూర్వక ప్రదర్శనకు కారణం దేశవ్యాప్తంగా 9% వోట్లు తగ్గటమే. బిజేపి కి 13% వోట్లు పెరిగినాయి.
- 2014 ఎన్నికలలో బిజేపి నాయకత్వం లోని ఎన్డిఏ కూటమి 336స్థానాలు సాదించగా, కాంగ్రెస్ నాయకత్వం లోని యూపిఏ_2 కూటమి 59 స్థానాలను, ఇతరులు 148 స్థానాలు సాదించిరి.
- ఈ ఎన్నికలలో పరాజయం పొందిన ప్రముఖులు 1. అరవింద కేజ్రివాల్(వారణాసి) 2. అరుణ్ జైట్లీ (అమృత్ సర్) 3.మీరా కుమార్ (మాజీ స్పీకర్—ససారామ్ -బీహార్) 4. అజిత్ సింగ్ (ఆర్ఎల్డి-భాగపత్ –యూపి) 5. నందన్ నీలేకరి (బంగళూర్ సౌత్ –కాంగ్రెస్స్-కర్ణాటక) 6. శరద్ యాదవ్ (జేడి-యూ అద్యక్షులు) 7.శృతి ఇరానీ,8.కపిల్ సిబాల్,9.బసుదేవ ఆచార్య, 10.ప్రియా దత్ (సునిల్ దత్ కుమార్తె) 11. సచిన్ పైలట్ (రాజస్థాన్) 12. రబ్ది దేవి (ఆర్జేడి)
- భావి భారత ప్రధానిగా కలలు కంటున్న మాయావతి అశలు నిరాశ అయినాయి. యూపి లో బిఎస్పి ఒక్క స్థానం కూడా సాదించక పూర్తిగా తుడుచుపెట్టుకు పోయినది.
- 4.1% ఓట్లు సాదించినప్పటికి బిఎస్పి కి ఒక్క స్థానము లబించలేదూ.బిఎస్పి కు 15వ లోక్ సభలో 21 స్థానాలు కలవు.
- తమిళ నాడులో జయ లలిత ఘనవిజయం సాదించినది. మొత్తం 39స్థానాలలో 37 స్థానాలు సొంతంగా ఏఐఏడిఎంకే గెలిచినది.పార్లమెంట్ లో అతిపెద్ద 3వ పార్టీ గా అవతరించినది. 3.3% వోట్లు సాదించినది.
- తమిళ్ నాడులో డిఎంకే ఒక్క స్థానం కూడా సంపాదించక పూర్తిగా తుడిచి పెట్టుకు పోయినది. డిఎంకే కు 15వ లోక్ సభ లో 18 స్థానాలు కలవు.
- దశాబ్ధాలుగా డిఎంకే కంచు కోట ఐనా చెన్నై నగరం లోని 3 పార్లమెంటరీ నియోజక వర్గాలలో తొలిసారి ఏఐఏడిఎంకే విజయం సాదించినది.
- అస్సామ్ ముఖ్య మంత్రి తరుణ్ గొగోయి, బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ ఎన్నికలలో పరాజయానికి నైతిక బాద్యత వహిస్తూ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేసినారు.
- అస్సామ్ లో బిజేపి 7స్థానాలు, కాంగ్రెస్ 3, ఏఐయూడిఎఫ్ 3,ఇండిపెండెంట్ ఒక స్థానం సాదించిరి.
- మోడి ప్రభంజనాన్ని ఎదుర్కొని ఒరిస్సా లో 4వ సారి ముఖ్య మంత్రి పదవిని బిజూ జనతాదళ్ కు చెందిన నవిన్ పట్నాయిక్ అదిష్టించబోతున్నారు.
- పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్స్ 34 స్థానాలు సాదించినది.3.8% వొట్లను సాదించినది.
- మమతా బెనెర్జీ మేనల్లుడు అబిషేక్ బెనెర్జీ పార్లమెంట్లో తొలి సారి అడుగు పెట్ట బోతున్నాడు.
- వెస్ట్ బెంగాల్ లో కమ్యూనిస్ట్లులు కేవలం 2 స్థానాలకే పరిమితం అయినారు.
- పశ్చిమ బెంగాల్ నుంచి రాష్ట్ర పతి కుమారుడు అబిజీత్ బెనర్జీ ఎన్నికైనారు.
- మొదటి సారిగా పంజాబ్ నుంచి ఏఏపి 25% వొట్ల తో ఉన్న 13స్థానాలలో 4 స్థానాలు గెలిచినది.
- మహారాస్త్ర లో కాంగ్రెస్స్ ప్రదర్శన అద్వానముగా ఉంది. 48 సీట్లలో కేవలం 2 సీట్లు గెలిచినది. ఎన్సిపి 4 స్థానాలు సాదించినది. బిజేపి+శివసేన కూటమి 42 స్థానాలు సాదించినవి.
- నవీన్ పట్నాయక్ మోడి ప్రబంజనాన్ని తట్టుకొని ఒరిస్సా లో 147 స్థానాలకు గాను 115 స్థానాలు సాదించారు. 1.7% వొట్లను సాదించినది.
- 2014 ఎన్నికలలో కాంగ్రెస్, బిజేపి నిలబెట్టిన ప్రతి ముగ్గురు లోక్ సభ అబ్యర్ధులలో ఒకరు క్రిమినల్ రికార్డ్ కలిగి ఉన్నారు.
- బిజేపి తరుపున పోటీ చేసిన ప్రతి ముగ్గిరిలో ఇద్దరు గెలుపు సాదించిరి.
- కర్నాటక నుంచి 4 మాజీ ముఖ్య మంత్రులు లోక్ సభ కు ఎన్నికైనారు. -1.వీరప్ప మొయిలీ (కాంగ్రెస్),యెడియూరప్ప (బిజేపి),సదానంద గౌడ (బిజేపి), దేవగౌడ(జేడి-ఎస్ .
- మోడి ప్రబంజనాన్ని నిలువరించిన రాష్ట్రాలు నాలుగు 1. ఒడిస్సా (నవీన్ పట్నాయక్)2.తమిళ్ నాడు (జయా లలిత) 3. వెస్ట్ బెంగాల్ (మమతా బెనెర్జీ ) కేరళ (ఒమేన్ చాంది)
- బిజేపి ప్రముఖుడు,మాజీ రక్షణ శాఖ మంత్రి 2014 ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన జసవంత్ సింగ్ ఎన్నికల లో ఓడిపోయినారు.
- కేంద్రం లో 1999-2004 వరకు మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఎన్డిఏ పూర్తి కాలం అధికారం లో ఉంది.
- బిజేపి మాజీ అద్యక్షుడు గడ్కారీ మొదటి సారిగా పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు.
- మేఘాలయ అధిక నోటా వొట్ల శాతం 2.8% సాదించినది.
- గుజరాత్ లో నోటా వోట్లు గా దాదాపు 4లక్షల,54వేల,880 పోల్ ఆవినవి. ఇవి గుజరాత్ లో కాంగ్రెసేతర,బిజేపి ఏతర పార్టీలు సంపాదించిన మొత్తం వొట్ల కన్నా అధికం.
- ప్రస్తుత 2014 ఎన్నికలలో దాదాపు 60 లక్షలకు పైగా నోటా వోట్లు పోల్ ఆవినవి. దేశవ్యాప్తం గా నోటా వోట్లు 1% కన్నా పైనే ఉన్నాయి.
- దేశం లో అత్యధికంగా యూపి నుంచి 5,91 లక్షల నోతా వోట్లు పోల్ అయినావి.
- ముఖ్యంగా రిజర్వుడ్ నియోజక వర్గాలలో నోటా వొట్లు అధికంగా పోల్ ఆవినవి.
- ఏఏపి ప్రముఖుడు యోగేంద్ర యాదవ్ గుర్గావ్ నుంచి ఎన్నికలలో ఒడి పోయినారు.
- సిపిఎం కేవలం 9 స్థానాలు (కేరళ-5,వెస్ట్ బెంగాల్-2,త్రిపుర -2) సాదించి జాతీయ పార్టీ హోదాను కోల్పోవ బోతున్నది.
- మొదటి నుండి ఇప్పటి వరకు పేరు మారని పార్టీ సిపిఐఎం మాత్రమే
- బిజేపి దక్షిణాది నుంచి పూర్వం 1998 లో అధికంగా 20 స్థానాలు సాదించగా ప్రస్తుతం 2014 లో అధికంగా 21 స్థానాలు సాదించినది.
- బిహార్ లో ఎన్డిఏ కూటమి మొత్తం 40 స్థానాలలో 32 స్థానాలు సాదించినది.
- రాజ్ థాకరే కు చెందిన ఎంఎన్ఎస్ మహారాస్ట్రా లో ఖాతా తెరవలేదు.
- అస్సామ్ నుంచి ఏజిపి కూడా ఖాతా తెరవలేదు (2009 లో ఒక స్థానం కలదు)
- పార్లమెంట్ ఎన్నికల తో పాటు బీహార్ లో జరిగిన 5 అసెంబ్లీ ఉప-ఎన్నికలలో 3 స్థానాలు ఆర్జేడి,1బిజేపి,1జేడి(యూ) సాదించినవి.
- ప్రధాన మంత్రి గా అధికారం లో ఉంది లోక్ సభ ఎన్నికలలో ఓడిపోయిన ఏకైక ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ .
- 2014 ఎన్నికలలో 62 మండి స్త్రీ లోక్ సభ సభ్యులు ఎన్నికైనారు. (2009 లో మహిళా లోక్ సభ సబ్యుల సంఖ్య 61)
- 2014 ఎన్నికలలో లోక్ సభ కు 23మండి ముస్లిం అబ్యర్ధులు ఎన్నికైనారు.
- 2014 ఎన్నికలలో లోక్ సభ కు 4గురు స్త్రీ ముస్లిం అబ్యర్ధులు ఎన్నికైనారు
- కేంద్రం లో బిజేపి/రాష్ట్రం లో టిడిపి 10 సంవత్సరాల తరువాత అధికారం లోకి రాబోతున్నవి.
- బిజేపి సొంతంగా తొలి సారి కేంద్రం లో సాదారణ మెజారిటీ ని సాదించినది.(282 స్థానాలు)
- బిజేపి ప్రబంజనము లో కూడా మద్య ప్రదేశ్ లో జోతిరాదిత్య సింధియా, కమల్ నాథ్ కాంగ్రెస్ తరుపున గెలిచారు.
- బిజేపి వృద్ద నేత ఎల్కే అద్వానీ గుజరాత్ లోని గాంధీ నగర్ నుంచి గెలిచారు.
- సుష్మా స్వరాజ్ మద్య ప్రదేశ్ విదిశ నియోజక వర్గం నుంచి ఎన్నికైనారు
- మోడి వడోదరా నుంచి అత్యదికంగా 5.7 లక్షల ఓట్ల మెజారిటీ తో గెలిచారు.
- శశి దరూర్ కేరళ తిరువనంత పురం నుంచి విజయం సాదించగా, కేంద్ర హోం శాఖ మంత్రి షిండే మహారాస్త్ర నుంచి పరాజయం పాలైనారు.
- ములాయం సింగ్ ఆజంఘడ్ నుంచి, వరుణ్ గాంధి సుల్తాన్ పూర్ నుంచి ఎన్నికైనారు.
- 6కేంద్ర పాలిత ప్రాంతాలలో బిజేపి నాల్గింటిని తన ఖాతాలో వేసుకుంధి,
- బిజేపి కూటమి కేంద్రం లో నాల్గోవ సారి అధికారం లోకి వస్తుంది. (1996లో,1998,1999,2014లో )
- లడక్ లో బిజేపి అబ్యర్ధి కేవలం 37 వొట్ల తేడా తో గెలిచాడు.
- నేతాజీ సుభాస్ చంద్ర బొసే మనమడు సుగత బొసే (జాదవ్ పూర్-వెస్ట్ బెంగాల్ -తృణమూల్ కాంగ్రెస్ తరుపున ) ఎన్నికైనారు.
- ఉత్తర్ ప్రదేశ్ లో ములాయం అతని కోడలు డింపుల్ యాదవ్ ఇరువురు గెల్చినారు.
- హర్యానా లో 15ఏళ్ల తరువాత బిజేపి మంచి ఫలితాలను అనగా 8 స్థానాలలో 7 స్థానాలు సాదించినది.
- జేఎంఎం నేత శిబూ సొరేన్,ఎల్జేపి నేత రామ్ విలాస్ పాశ్వాన్ విజయం సాదించినారు.
- బోడోలు అధికంగా నివసించే అస్సామ్ లోని కొక్రాఝార్ నియోజక వర్గం నుంచి మొదటి సారిగా నాన్-బోడో వ్యక్తి ఎన్నికైనారు.
- బిజేపి 5వేలు మెజారిటీ తో ఒక స్థానాన్ని, లక్షకు పైగా మెజారిటీ తో 195 లోక్ సభ స్థానాలు గెల్చుకొన్నది.
- ఒర్రిస్సా లో బిజేడి లోక్ సభ మొత్తం21 స్థానాలలో 20 స్థానాలను స్వాదినం చేసుకోంది.
- 2014 లోక్ సభ సబ్యులలో మొత్తం 543 మందిలో 55+ వయస్సు ఉన్నవారు 47%, 55 కన్నా తక్కువ ఉన్న వారు 53% ఉన్నారు.
- 40కన్నా తక్కువ వయస్సు ఉన్నవారు 71మండి ఎంపిలు ఉన్నారు. 55 కన్నా తక్కువ ఉన్నవారు 216 మంధి ఉన్నారు.
- బిజేపి కి చెందిన ఎల్కే అద్వానీ అందరి కన్నా అధికంగా వయస్సు ఉన్న ఎంపి 86 సంవత్సరాలు.
- దేశంలో మెజారిటీ దృష్ట్యా మొదటి ఐదు స్థానాలు సాదించిన వారు బిజేపి అబ్యర్ధులు.
- ఒకే ఒక ఎగ్జిట్ పోల్ టుడేస్ చాణక్య నిజమాయినది. . ఇది న్యూస్ 24 కోసం ఎగ్జిట్ పోల్ నిర్వహించినది. ఎగ్జిట్ పోల్ లో యూపిఏ కు 70 స్థానాలు ఎన్డిఏ కు 340 స్థానాలు వస్తాయని చెప్పింది.
- 2014 లోక్ సభ ఎన్నికలలో లోక్ సభ కు కేవలం 3 ఇండిపెండెంట్లు మాత్రమే ఎన్నికైనారు
- బిజేపి ధాటికి బిఎస్పి,డిఎంకే,ఎన్సి, సహా దేశవ్యాప్తంగా 1850 రాజకీయా పక్షాలు సున్నా ఫలితాలను సాదించాయి.
- 2014 లోక్ సభ ఎన్నికలలో అత్యధికం ధనం కలిగిన కోటీశ్వర్లు 10 మండి పోటీ చేయగా వీరిలో ఇరువురు మాత్రమే ఎన్నికైనారు.
- మహారాష్ట్ర నుండి ఎన్నికైన 48 మండి లోక్ సభ సబ్యులలో 29 మండి కొత్తవారు.
- 2014 లోక్ సభ ఎన్నికలలో ఎన్నికైనవారిలో 75%మండి పట్టబద్రులు,10% మండి మెట్రికులేషన్ అర్హతగా ఉన్నవారు. 6% మండి డాక్టరేట్ కలిగిన వారు.
- వ్యవసాయం వృత్తిగా ఉన్న ఎంపి లు 27%, సాంఘిక సేవ వృత్తిగా ఉన్న ఎంపి లు 24%, వ్యాపారం వృత్తిగా ఉన్న వారు 20% ఉన్నారు.
- 16వ లోక్ సభ లో 38 మండి లాయర్లు, 24మండి డాక్టర్లు, 18 మండి కళాకారులు.
- రాజస్తాన్ నుండి కేవలం ఒక మహిళా మాత్రమే లోక్ సభ కు ఎన్నికైనది.
- మన్మోహన్ మంత్రి వర్గం లోని కేవలం 3గురు కాబినెట్ మంత్రులు, 3స్టేట్ మంత్రులు,8 మండి సహాయ మంత్రులు మాత్రమే విజయం సాదించారు.
- సిక్కిం కు చెందిన పవన్ చాంలింగ్ వరుసగా 5సారి ముఖ్య మంత్రి స్థానాన్ని అడిస్టించబోతున్నారు. ఇది ఒక రికార్డ్.
మాజీ అధికారులు:
- ఎన్నికైనవారు:
1.మాజీ హోం సెక్రెటరీ ఆర్కే సింగ్, 2.మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వికే సింగ్, 3.మాజీ ముంబై పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ , 4.మాజీ రాజస్థాన్ డిజిపి హెచ్సి మీనా మొదలగు వారందరూ బిజేపి టిక్కట్ పై లోక్ సభ కు ఎన్నికైనారు.
సినిమా రంగం:
- గెల్చిన వారు -హేమా మాలిని (బిజేపి –మధుర-యూపి) శత్రుఘ్న్ సిన్హా (బిహార్-బిజేపి-పాట్నా సాహిబ్-బిహార్ ) పరేశ్ రావల్ (ఈస్ట్ అల్లహాబాద్-యూపి-బిజేపి) వినోద్ ఖన్నా (బిజేపి-పంజాబ్ –గురుదాస్ పూర్) కిరణ్ ఖేర్ (బిజేపి-చండీగర్)మూన్-మూన్-సేన్ (టిఎంసి-వెస్ట్ బెంగాల్) ఇన్నోసెంట్ (కేరళ-ఇండిపెండెంట్) మనోజ్ తివారీ (డిల్లీ నార్త్ –బిజేపి)
- ఓడిన వారు – రాజ్ బబ్బర్,నగ్మా,గుల్ పనాగ్ ,జయప్రధ, జావేద్ జాఫ్రీ, స్మృతి ఇరానీ,రవి కిషేన్,కునాల్ సింగ్,రాఖీ సావంత్,
క్రీడాకారులు
- గెల్చినవారు: రాజవర్ధన్ రాథోర్(షూటింగ్)
- ఒడినవారు- దిలీప్ తిర్కే (హాకీ),మహమ్మద్ కైఫ్ (క్రికెట్) బైచుంగ్ భుటియా (పూట్ బాల్)
ఆంధ్ర ప్రదేశ్ ఫలితాల విశేషాలు
- తెలుగు దేశం స్థాపకుడు ఎన్టిఆర్ స్వస్థలం గుడివాడ లో టిడిపి ఒడి పోయినది. వైకాప కు చెందిన కొడాలి నాని అక్కడి నుండి విజయం సాదించారు.
- వై కా పా అబ్యర్ధి అల్లా రామ కృష్ణా రెడ్డి మంగళగిరి నుంచి కేవలం 12 వొట్ల తేడాతో అది పోస్టల్ బ్యాలట్ల సహాయం తో గెలిచారు.
- అనంత పురం జిల్లా నుంచి జేసి బ్రదర్స్ ఇరువురు గెలిచినారు.జేసి దివాకర రెడ్డి పార్లమెంట్ కు, జేసి ప్రభాకర రెడ్డి అసెంబ్లీ కి గెలిచారు.
- పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి వర్గం లో పనిచేసిన పల్లం రాజు,పనబాక లక్ష్మి,కేసి దేవ్,కిల్లి కృపా రాణి తమ డిపాజిట్లను కోల్పోయారు. పురందేశ్వరి,కోట్ల విజయభాస్కర రెడ్డి కూడా ఓడిపోయినారు.
- ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జయ సమైక్యాంద్ర పార్టీ ఖాతాను తెరవలేదు. అతని తమ్ముడు పీలేరు నుంచి పరాజయం పొందినారు.
- వైకాపా కు చెందిన శోభ నాగి రెడ్డి చరిత్ర సృష్టించారు. ఆమె మరణించిన తరువాత కూడా అసెంబ్లి ఎన్నికలలో విజయం సాధించారు.
- బొత్చ కుటుంబానికి చెందిన నలుగురు ఎన్నికలలో పరాజయం పాలయ్యారు.
- తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు పొన్నాల భారీ తేడా తో ఎన్నికలలో ఓడిపోయినారు.
- జగన్ తొలి సారిగా అసెంబ్లీ లో అడుగు పెట్టబోతున్నారు.
- లోక్ సత్తా పార్టీ అద్యక్షుడు జేపి మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికలలో ఓడిపోయినారు.
- వైకాపా అద్యక్షురాలు విజయమ్మ విశాఖ పట్టణం నుంచి ఎన్నికలలో ఓడిపోయినారు.
- ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్స్ పార్టీ అద్యక్షులు రఘువీరా రెడ్డి ఎన్నికలలో పరాజయం పోయిందినారు. డిపాజిట్ కోల్పోయినారు.
- మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర తెనాలి నుంచి ఒడి పోయినారు.మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి కూడా ఓడిపోయినారు.
- గల్లా అరుణకుమారి ఓడిపోగా, ఆమె కుమారుడు గల్లా జయదేవ గుంటూర్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైనారు.
- సినీ తారలు బాల కృష్ణా, రోజా ఎన్నికైనారు.
- శ్రీకాకులం జిల్లా లో ధర్మాన ఇద్దరి సోదరుల పరాజయం
- అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ పరాజయం.
- 14 మండి రాష్ట్ర మంత్రులు ఓడిపోయినారు.
- టిజి వెంకటేష్, ఎరాసు ప్రతాప రెడ్డి,కన్నా,ఆనం ఎన్నికలలో ఓడిపోయినారు.
- జేఎస్పి, లోక్ సత్తా పార్టీలకు ఈ ఎన్నికలలో ఘోర పరాజయం సంభవించినది.
- సీమాంద్ర నుండి బిజేపి ఈ సారి అత్యాదికంగా 4 స్థానాలు సాదించి రికార్డ్ స్థాపించినది.
- ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో కేవలం 3 పార్టీలే ప్రాతినిద్యం వహి స్థాయి. టిడిపి(102),బిజేపి(04)వైసిపి (67) ఇద్దరు ఇండిపెండెంట్ లు మొత్తం అసెంబ్లీ సబ్యుల సంఖ్య 175.
- తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి మంత్రివర్గాన్ని టిఆర్ఎస్ ఏర్పర్చబోతున్నది.
- తెలంగాణ నుంచి గెల్చిన వారిలో ఈ.రాజేందర్, ఎర్రబిల్లి దయాకర్, గీతా రెడ్డి, కవిత, హరీష్ రావు,
తారక రామారావు, రేవంత రెడ్డి, గ.నాగేశ్,వినోద్ కుమార్, గుట్ట సుకెందర్ రెడ్డి, దత్తాత్రేయ,చెన్నమ నేనీ రేమేష్ బాబు, జీవన్ రెడ్డి,గంప గోవర్ధన్,చిన్న రెడ్డి, కొండా సురేఖ ముఖ్యులు.
కేసిఆర్ అసెంబ్లీ, పార్లమెంట్ రెండిటినుంచి విజయం సాదించారు.
- తెలంగాణా లో ఓడిన ప్రముఖులలో జగ్గారెడ్డి(సంగారెడ్డి అసెంబ్లీ) మధు యస్కీ(నిజామాబాద్ పార్లమెంట్) పొన్నం ప్రభాకర్ (కరీంనగర్ పార్లమెంట్) దామోదరం నరసింహా ,డి.శ్రీనివాస్,విజయ శాంతి,నామా నాగేశ్వర రావు,మంధ కృష్ణ మాదిగ ముఖ్యులు
- సీమాంద్ర నుండి ఎన్నికైన 82 ఎంఎల్ఏ లు,11మండి ఎంపిలు, తెలంగాణా నుండి ఎన్నికైన 63 మండి ఎంఎల్ఏ లు, 8 ఎంపి లకు క్రిమినల్ రెకార్డ్ ఉంది.
- సీమాంద్రాలో వైకాపా గెల్చిన 13 చోట్ల దాని మెజారిటీ 2వేల లోపే. మంగళగిరి లో కేవలం 12 వొట్ల తేడాతో గెల్చినది.
No comments
Post a Comment